ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 27, 2020, 10:21 AM IST

ETV Bharat / state

పెందుర్తి గొల్లపల్లిలో కొండచిలువ కలకలం

విశాఖ జిల్లా గొల్లపల్లి వద్ద జాతీయ రహదారిపై కొండచిలువ కనిపించింది. వంతెన పనులు జరుగుతున్నచోట దాన్ని చూసి కూలీలు భయాందోళనకు గురయ్యారు.

python
గొల్లపల్లిలో కొండచిలువ కలకలం

పెందుర్తి - అనకాపల్లి రహదారిలో గొల్లపల్లి వద్ద కొండచిలువ కనిపించింది. వంతెన నిర్మాణ పనుల కోసం ఉంచిన ఇనుప చువ్వల మధ్య ఉన్న కొండచిలువను చూసి కూలీలు భయాందోళనకు గురయ్యారు. స్థానికంగా పాములు పట్టే గణేశ్​ అనే వ్యక్తికి సమాచారం అందించటంతో..అతను చాకచక్యంగా దాన్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. చుట్టు పక్కలంతా అరణ్య ప్రాంతం కావటంతో రోజూ పాములు వస్తున్నాయని కూలీలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details