పురందేశ్వరికీ బి పారం అందజేస్తున్న హరిబాబు ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తరుఫున బరిలో నిలిచిన అభ్యర్థులకు విశాఖ భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో బి-ఫారాలు అందించారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డి.పురందేశ్వరికి, ఎంపీ కంభంపాటి హరిబాబు బి-ఫారం అందించారు. విశాఖలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసిన ప్రజలు మళ్లీ ఆదరిస్తారని పురందేశ్వరి చెప్పారు. దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. ప్రతి ఓటు అభ్యర్థులకు కాదని..ప్రధాని మోదీకి వేసినట్లుగా భావించాలన్నారు.
ఇవీ చూడండి