చోడవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా - latest protest news in chodavaram
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు, వెలుగు వీవోఏలు, వలస కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ మేరకు చోడవరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.
![చోడవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా protest under the direction of CITU](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7302800-528-7302800-1590153866706.jpg)
సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
విశాఖ జిల్లా చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు, వెలుగు వీవోఏలు, వలస కార్మికుల ధర్నా చేపట్టారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రవికుమార్కు వినతి పత్రం అందజేశారు. ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వలేదని వెలుగు వీవోఏలు ఆవేదన వ్యక్తం చేశారు..