రాష్ట్రంలో నిత్యావసర సరకుల ధరల పెంపునకు నిరసనగా... ఈనెల 28న నర్సీపట్నం పురపాలక కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్టు మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని కరపత్రాలు పంచారు. ఇందులో భాగంగా ఈనెల 28న ఆందోళన చేపడుతున్నట్లు అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
ఈ నెల 28 న నర్సీపట్నంలో తెదేపా ధర్నా - protest in narseepatnam
ఈ నెల 28న నర్సీపట్నంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెదేపా నేత అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. రాష్ట్రంలో వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని ఆరోపించారు.
![ఈ నెల 28 న నర్సీపట్నంలో తెదేపా ధర్నా protest in narseepatnam at 28th this month](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10017509-319-10017509-1608991434999.jpg)
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు