విశాఖ జిల్లా చోడవరంలో కరోన వైరస్ బారిన పడకుండా వైద్యులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మంది వల్ల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వారికి ముందుగానే విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయడంతో వైద్యులు కొంత ఊరట చెందారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ముందుగా ఉష్ణోగ్రత పరీక్షలు జరుపుతున్నారు. దగ్గు, రొంప వంటి లక్షణాలను నిర్ధారించుకుంటున్నారు. కొవిడ్ - 19 వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డును తయారుచేశారు. వైద్యులతో పాటు సిబ్బంది... మాస్క్లు ధరించి సాధారణ రోగులను పరీక్షిస్తున్నారు.
చోడవరంలో కొవిడ్-19పై అప్రమత్తమైన వైద్యులు - చోడవరంలో అప్రమత్తమైన వైద్యలు
కొవిడ్-19 బారిన పడకుండా విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రోగులకు ముందస్తుగా ఉష్ణోగ్రత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం వ్యాధి లక్షణాలను రోగులను అడిగి తెలుసుకుంటున్నారు. కొవిడ్-19 కోసం ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించారు. సిబ్బందిని మాస్కులు ధరించి రోగులకు వైద్యం అందించాలని ఆదేశాలిచ్చారు.
చోడవరం వైద్యులు ముందస్తు జాగ్రత్తలు