ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 26, 2021, 11:23 PM IST

Updated : Mar 27, 2021, 4:18 AM IST

ETV Bharat / state

ఏయూ పరిధిలో నేటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా

శనివారం నుంచి ఏయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్ తెలిపారు.

ఏయూ పరిధిలో రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా
ఏయూ పరిధిలో రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏయూ పరిధిలో నేటి నుంచి జరిగాల్సిన బీఈ, బీటెక్, బీ-ఫార్మసీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణ మోహన్ అధికారికంగా ప్రకటించారు. తదుపరి పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. వర్సిటీ క్యాంపస్‌, కళాశాలల్లో ఆన్‌లైన్‌లోనే క్లాసులు నిర్వహిస్తామన్న అధికారులు...ఇంజనీరింగ్ కళాశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఏయూ క్యాంపస్‌, కళాశాలల్లో క్లాసులు ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు వర్సటీ రిజిస్ట్రార్ తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలలో కరోనా కేసుల పెరుగుదలతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఏయూ పరిధిలో రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా

ఇదీ చదవండి: ఏపీ నూతన ఎస్‌ఈసీగా నీలం సాహ్ని

Last Updated : Mar 27, 2021, 4:18 AM IST

ABOUT THE AUTHOR

...view details