విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో స్థానిక పోలీసులు.. ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కలిగిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు సూచించారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను అందరూ తప్పనిసరిగా పాటించాలని.. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు
శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలకు పాటించాల్సిన సూచనలపై విశాఖపట్నం జిల్లా యలమంచిలి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
యలమంచిలిలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు