ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 26, 2021, 4:59 PM IST

ETV Bharat / state

అరకు లోయలో రూ.80 లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత

విశాఖ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి 1,150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

police  Seizure of cannabis
గంజాయి పట్టివేత

విశాఖ జిల్లా అరకులోయలో కంటైనర్​లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్​తో పాటు 1,150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.80 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి బిహార్​కు కంటైనర్​లో గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details