విశాఖ జిల్లా గోపాలపట్నం ఇందిరానగర్లో బెల్టు షాపులో మద్యం విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి 17 మద్యం సీసాలు, కొంత నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. గోపాలపట్నం పరిసర ప్రాంతంలో చాలా మంది యువకులు ఇది వ్యాపారంగా మలుచుకున్నారు. దీనిపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.