ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖమన్యంలో కాల్పులు.. ఇద్దరి మృతి - vizag

విశాఖ మన్యంలో కాల్పులు జరిగాయి. పెదబయలు మండలం పెడకోడాపల్లి పంచాయతీ పరిధిలోని బురదమామిడిలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.

పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి

By

Published : Mar 16, 2019, 1:54 PM IST

పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి
విశాఖ మన్యంలో కాల్పులు జరిగాయి. పెదబయలు మండలం పెడకోడాపల్లి పంచాయతీ పరిధిలోని బురదమామిడిలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మృతులను సీదరి జమదర్, బట్టి భూషణంగా గుర్తించారు. తమపై కాల్పులు జరపిన కారణంగా.. ఎదురు కాల్పులు చేశామని పోలీసులు చెబుతున్నారు. సిబ్బందిలో ఒకరికి గాయమైందన్నారు.

అమాయకులను హతమార్చారు!

వేటకు వెళ్లిన తమవారిని పోలీసులు హతమార్చారని గ్రామస్తులు ఆరోపించారు. అమాయక గిరిజనులను చంపేశారని ఆగ్రహిస్తూ పోలీసులపై ఎదురుతిరిగారు. మృతదేహాలను తీసుకెళ్లడానికి వచ్చిన పోలీసులను చుట్టుముట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details