విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని మారుమూల అటవీ గిరిజన ప్రాంతాల్లో... నాటుసారా స్థావరాలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు పదహారు వందల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అలాగే సారా తయారీకి ఉపయోగించే వంటపాత్రలు ఇతర ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత సింగవరం , సింగరాజు పేట, మర్రిపాలెం, డౌనూరు...ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో కొయ్యూరు పోలీస్ సిబ్బంది ఎస్సై నాయుడు, రాము, రమణ, మూర్తి పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో సారా స్థావరాలపై దాడులు - గిరిజన ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలపై దాడులు
మారుమూల అటవీ గిరిజన ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు పదహారు వందల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
![గిరిజన ప్రాంతాల్లో సారా స్థావరాలపై దాడులు raids on liquor bases in remote forest tribal areas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9483265-761-9483265-1604902413418.jpg)
గిరిజన ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలపై దాడులు