ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో గంజాయి తరలింపు.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని పోలీసు జాగిలాలు పసిగట్టాయి. ఇద్దరు వ్యక్తుల నుంచి 34 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Sep 6, 2019, 9:44 AM IST

ఆర్టీసీ బస్సులో గంజాయి తరలింపు.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ఆర్టీసీ బస్సులో గంజాయి తరలింపు.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా మాడుగుల కూడలి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. పోలీసు జాగిలాలు గంజాయి వాసన గ్రహించాయి. అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు వ్యక్తుల నుంచి 34 కిలోల గంజాయి, 2 చరవాణులు, 11 వేల 200 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి.. రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details