చరవాణి విషయంలో జరిగిన వివాదం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కొణతాల మధు అనే యువకుడికి, లావరాజు అలియాస్ లోవ అనే వ్యక్తికి సెల్ఫోన్ విషయమై ఘర్షణ తలెత్తింది.
ఈ క్రమంలో మధుపై లోవ బ్లేడుతో దాడిచేశాడు. మధు గొంతు భాగంలో గాయమైంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై ఈశ్వరరావు తెలిపారు.