ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలతో మన్యం ప్రజల ఇక్కట్లు - vishakapatnam latest news

అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ మన్యంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాగులు పొంగుతున్న కారణంగా.. పలు గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భారీ వర్షాలతో మన్యం ప్రజల ఇక్కట్లు
భారీ వర్షాలతో మన్యం ప్రజల ఇక్కట్లు

By

Published : Oct 14, 2020, 7:06 PM IST

విశాఖ మన్యంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాటిని దాటి మండల కేంద్రాలకు రావడాని అవస్థలు పడుతున్నారు. అరకులోయ మండలంలోని పెదలబుడు గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా జలదిగ్భందమైంది.

డుంబ్రిగూడ మండలంలో వాగులకు వంతెనలు లేని కారణంగా.... రాకపోకల కోసం తాడు కట్టుకుని వాగులను దాటుతున్నారు. ఐటీడీఏ అధికారులు, ప్రభుత్వం స్పందించి వాన కాలంలో తమ ఇబ్బందులను తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కొట్టుకుపోయిన కాజ్​వే.. నిలిచిన రాకపోకలు

ABOUT THE AUTHOR

...view details