ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తగ్గిన వరద.. పెద్దేరు జలాశయం గేట్లు మూసివేత

విశాఖలోని పెద్దేరు జలాశయం గేట్లను అధికారులు మూసేశారు. జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టిన కారణంగా.. మూసివేసినట్లు తెలిపారు.

By

Published : Nov 28, 2020, 4:36 PM IST

pedderu reservoir gates closed in vishakapatnam
పెద్దేరు జలాశయం గేట్లు మూసివేత

విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయం గేట్లను అధికారులు మూసివేశారు. జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకున్న కారణంగా.. నదిలోకి నీటిని విడిచిన అధికారులు.. వర్షాలు తగ్గి, వరద సైతం తగ్గిన కారణంగా.. గేట్లు మూసేశారు. వరద నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్​ఫ్లో 125 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 136.60 మీటర్లుగా ఉందని ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details