విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు.. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి కదిలింది. శ్రీనివాసరావు అనే ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావును రైలు కొంతమేర ఈడ్చుకెళ్లింది. అక్కడే విధుల్లో ఉన్న రైల్వే రక్షణ దళం(ఆర్ఫీఎఫ్) సిబ్బంది తక్షణమే స్పందించి ప్రయాణికుడిని రక్షించారు. ఆర్పీఎఫ్ తక్షణ సమయస్ఫూర్తి కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు నిలబడ్డాయి. ఈ దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికుడిని రక్షించిన రైల్వే పోలీస్ - విశాఖ రైల్వే స్టేషన్లో కిందపడిపోయిన ప్రయాణికుడు
కదులుతున్న రైలు ఎక్కేందుకు యత్నించి ప్రమాదవశాత్తు కిందపడిపోయిన ఓ ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది రక్షించారు. ఈ ఘటన విశాఖ రైల్వే స్టేషన్ జరిగింది.
విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికుడిని రక్షించిన రైల్వే పోలీస్