ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరు ఐటీడీఏ పీవోకు ఘనంగా వీడ్కోలు - పాడేరు ఐటీడీఏ పీవో తాజా వార్తలు

పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్​ అధికారి ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయనకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.

paderu itda po honoured by mla bhagyalaxmi and his husband
పాడేరు ఐటీడీఏ పీవోను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు

By

Published : May 1, 2020, 9:55 AM IST

పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్​ అధికారి డీకే బాలాజీకి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. విశాఖ ఏజెన్సీలో మూడేళ్లుగా సబ్​ కలెక్టర్​గా విధుల్లో చేరి ఐటీడీఏ పీవోగా పదోన్నతి పొంది విశేష సేవలు అందించారని పాడేరు ఎమ్మెల్యే తెలిపారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి తనదైన కృషి చేశారని కొనియాడారు. గిరిజన ప్రజా శ్రేయస్సే పరమావధిగా భావించి విధులు నిర్వర్తించారని చెప్పారు. అనంతరం ఐటీడీఏ పీవో విధి నిర్వహణలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

పాడేరు ఐటీడీఏ పీవోను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు

ABOUT THE AUTHOR

...view details