విశాఖ జిల్లా మాడుగుల మండలం డి. గొటివాడ - సాగరం రోడ్డు వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి డి.గొటివాడ గ్రామానికి చెందిన గోకాడ గోసం నాయుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి - డి గొటివాడ రోడ్డు ప్రమాదం న్యూస్
ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన విశాఖ జిల్లా డి.గొటివాడలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి