ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆవును రక్షించబోయి విద్యుదాఘాతంతో వృద్దురాలు మృతి

పొలంలో పశువులను మేపుతుండగా తెగిపడిన విద్యుత్ వైరు తగిలి ఆవు విద్యుదాఘాతానికి గురవ్వగా... దానిని రక్షించే క్రమంలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా కోడూరులో జరిగింది.

By

Published : Sep 5, 2019, 9:21 AM IST

విద్యుదాఘాతం... వృద్ధురాలు, ఆవు మృతి


విశాఖ జిల్లా అనకాపల్లి కోడూరులో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో వృద్ధురాలుతో సహా ఆవు మృతి చెందింది. రాములమ్మ అనే వృద్ధురాలు పశువులను మేపుతుండగా తెగిపడిన విద్యుత్ వైరు ఆవుకు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. ఆవును రక్షించే క్రమంలో మహిళ సైతం కరెంట్ షాకుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విద్యుదాఘాతం... వృద్ధురాలు, ఆవు మృతి
ఇవీ చూడండి-లండన్ నుంచి వచ్చాడు... అదృశ్యమయ్యాడు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details