ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం వస్తున్నారు వెళ్లిపోవాలన్న అధికారులు.. చిరు వ్యాపారుల ఆందోళన - సీఎం జగన్ పర్యటన

Sharada peetam anniversary : శారదాపీఠం వార్షికోత్సవాలకు ప్రముఖుల రాక నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28న సీఎం జగన్ పర్యటన ఖరారు కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం రాక సందర్భంగా అధికారులు అత్యుత్సాహం చూపుతున్నట్లు స్థానికులు, చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

small traders
చిరు వ్యాపారుల అందోళన

By

Published : Jan 24, 2023, 9:04 PM IST

Sharada peetam anniversary : విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొనే అవకాశం ఉండగా.. పర్యటన తేదీ సైతం ఖరారైంది. కాగా, ఏర్పాట్ల పేరిట అధికారులు అత్యుత్సాహం చూపుతుండడం వివాదాస్పదమైంది. శారదాపీఠం వార్షికోత్సవాలకు ప్రముఖులు రానుండడంతో అక్కడ సుందరీకరణ పనుల్లో అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేస్తున్న తరుణంలో డివైడర్ల మధ్యలో చెట్లను తొలగించారు. మళ్లీ కొత్తగా అక్కడ కుండీలను పెట్టేందుకు ప్రయత్నాలు వేగంగా చేస్తున్నారు. మరోవైపు ఈనెల 28న పీఠానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక ఖరారు కావడంతో బీఆర్ టీఎస్​రోడ్​ను ఆనుకుని ఉన్న దుకాణాలను మూసివేయాల్సిందిగా పోలీసులు, జీవీఎంసీ సిబ్బంది ఆదేశించడం చిరువ్యాపారులను తీవ్రంగా కలవరపెడుతోంది. సీఎం పర్యటన చిరువ్యాపారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఏర్పాట్ల సాకుతో తమపై ఈరకంగా ప్రవర్తించవద్దని వేడుకుంటున్నారు.

సీఎం వస్తున్నారు వెళ్లిపోవాలన్న అధికారులు.. చిరు వ్యాపారుల ఆందోళన

"అధికారులు రెండు రోజుల కిందట మా దగ్గరకు వచ్చి షాపులు మూసేయమని చెప్పారు. ఎంతో ఇష్టంతో దుకాణాల ముందు పెంచుకున్న చెట్లను కూడా తొలగించాలని చెప్పి వెళ్లారు... మా కుటుంబాలకు వ్యాపారమే ఆధారం. దుకాణాలపైనే ఆధారపడి బతుకుతున్నాం. అధికారులు చిన్న, చిన్న అవసరాల కోసం మా జీవనోపాధిని దెబ్బతీయడం తగదు. వ్యాపారం చేస్తేనే మా కుటుంబాలు గడుస్తాయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్లమని చెప్పడం సరికాదు" - చిరు వ్యాపారుల ఆవేదన

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details