విశాఖలో కొవిడ్ కేసుల చికిత్స కోసం కేజీహెచ్లో కొత్త బ్లాక్ సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ సామాజిక బాధ్యత కింద ఈ బ్లాక్ ను నిర్మించాయి. రూ. 46 కోట్లతో ఈ ఐదంతస్థుల భవన సముదాయ నిర్మాణానికి ఖర్చయింది. ఎకరం స్థలంలో దీనిని నిర్మించారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్ ప్లాంట్ గెయిల్, బెల్, ఓఎన్జీసీ, హెచ్పీసీఎల్, ఎన్టీపీసీ,ఎన్పీపీఐఎల్ సంస్థలు తమ సామాజిక బాధ్యత కింద నిధులను కొవిడ్ బ్లాక్ నిర్మాణం కోసం అందించాయి. 2016లో బ్లాక్ నిర్మాణం ప్రారంభం అయినప్పటికీ కొంత నిధులను దశల వారీగా విడుదలకు.. ఆయా సంస్థలు చర్యలు చేపట్టడంలో జాప్యం అనివార్యమైంది. సర్జికల్ అంకాలజీ భాగంగా దీనిని తీర్చిదిద్దేందుకు నిర్దేశించారు.