విశాఖలోని జాతీయ పరిశోధన అభివృద్ది సంస్థ(ఎన్ఆర్డీసీ)కు జాతీయ మేధో సంపత్తి అవార్డు-2020 లభించింది. దేశంలో మేధో సంపత్తి హక్కులు వచ్చేందుకు ఉత్తమ ఆవిష్కరణలు చేయడానికి విశేష కృషి చేసిన భారత ప్రభుత్వ పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం అధికారులు ప్రతి ఏటా ఈ అవార్డులను బహుకరిస్తారు.
విశాఖ కేంద్రం ప్రాంతీయ మేనేజర్ డాక్టర్ బీకే సాహు ఈనెల 17న దిల్లీలో కేంద్ర మంత్రి నుంచి ఈ అవార్డును అందుకోనున్నారు. దక్షిణాదిలో పేటెంట్లు పొందేందుకు యువ ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చి వారికి మేధో హక్కులు పొందేందుకు ఈ సంస్ధ సహకారం అందిస్తోంది.