ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 3, 2020, 10:42 PM IST

ETV Bharat / state

'విద్యుత్ మీటర్లుపై రైతులకున్న అపోహలు తొలగించాలి'

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రైతులకు పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు మెరుగైన సేవలు అందించడానికి చేపట్టే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను నర్సీపట్నం సబ్​కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఆదేశించారు. విద్యుత్ మీటర్లు ఏర్పాటుపై రైతులకున్న అపోహలను తొలగించాలన్నారు. సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

narsipatam sub collector review meeting on electric meters for farmers
విద్యుత్ మీటర్లుపై రైతులకున్న అపోహలు తొలగించాలి'

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ఉచిత విద్యుత్ పథకానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని సబ్​కలెక్టర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. సబ్​కలెక్టర్​ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి డివిజన్ స్థాయి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని పేర్కొన్నారు. డివిజన్, మండల, గ్రామ స్థాయి కమిటీలు వారికి కేటాయించిన పనులను పక్కాగా అమలు చేయాలన్నారు.

గ్రామస్థాయిలో వీఆర్వో, విద్యుత్​ సిబ్బంది, వ్యవసాయశాఖ ఫీల్డ్ ఆఫీసర్​తో కూడిన బృందం... రైతుల వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై అవగాహణ కల్పించాలన్నారు. విద్యుత్ మీటర్లు ఏర్పాటు, రైతు ఖాతాలో నగదు బదిలీపై తదితర అంశాలపై పూర్తిస్థాయిలో వివరించి రైతులకు ఉన్న అపోహలు తొలగించాలని అధికారులకు సూచించారు.

ఇదీ చూడండి:తిరుపతి యువతి.. మూగజీవాల ప్రియనేస్తం!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details