ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 24, 2021, 6:28 PM IST

ETV Bharat / state

'ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల సమగ్ర నివేదికను సకాలంలో అందించాలి'

ఆర్​ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీపై అధికారులతో నర్సీపట్నం సబ్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ అంశంపై అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు.

narseepatnam sub collector orders on ROFR documents distributions
నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య

ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సకాలంలో సమర్పించాలని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఆదేశించారు. నర్సీపట్నం డివిజన్​కు సంబంధించి తహసీల్దార్, అటవీ అధికారులు, సర్వేయర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో సబ్ కలెక్టర్ మాట్లాడారు.

ఈ సమావేశానికి కొందరు అధికారులు గైర్హాజరయ్యారు. అధికారుల పనితీరుపై సబ్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, రికార్డులను పక్కాగా రూపొందించాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details