ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాను రాజకీయం చేయాలని చూస్తున్నారు: ఎమ్మెల్యే గణేష్ - కరోనా వైరస్

కరోనాను రాజకీయం చేసి తెదేపా నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు.

narisipatnam MLA uma shankar ganesh PRESS MEET
నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్

By

Published : Apr 18, 2020, 8:07 PM IST

ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ పై రాజకీయం చేసి లబ్ది పొందాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రణాళిక చేస్తున్నారని... ఈ ప్రయత్నాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. కరోనా పై వాస్తవాలను దాయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఈ విషయాన్ని తెదేపా నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఆంగ్ల మాధ్యమం జీవోపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దృష్టిలో ఉంచుకొని సంబరాలు చేసుకోవడం తెలుగుదేశం నేతలకు తగదని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details