విశాఖ జిల్లా పాడేరు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల పునః ప్రారంభమైనప్పటి నుంచి నాడు నేడు పనులు చేయిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పండుగ సెలవులకు వెళ్లే వారిని కూడా ఈరోజు పనులు చేయించారని.. మధ్యాహ్నం వరకు పిల్లలు పనిలోనే ఉన్నారన్నారు. పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ పనులు అప్పగిస్తారని చెబుతున్నారు. ప్రతిరోజు రాళ్లు మోయటం, ఇసుక పని, ఇతర భవన నిర్మాణ పనులను తమ పిల్లలతో చేయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
"కొవిడ్ కారణంగా ఇప్పటికే పిల్లలు చదువును కోల్పోయారు. ఇక్కడ వారితో పనులు చేయిస్తున్నారు. చదువు చెప్పాలి కానీ..పనులు చేయించటం తప్పు" -ఓ విద్యార్థిని తండ్రి