ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దొంగల వలన మత విద్వేషాలు చెలరేగే అవకాశం ఉంది' - ఎంవీపీ కాలనీ సాయిబాబా ఆలయం న్యూస్

విశాఖ ఎంవీపీ కాలనీ సాయిబాబా ఆలయంలో చోరీకి ప్రయత్నించిన నిందితులను అరెస్టు చేసినట్లు.. విశాఖ శాంతిభద్రతల డీసీపీ-1 ఐశ్వర్య రస్తోగి తెలిపారు. అంతర్వేది ఘటనను దృష్టిలో పెట్టుకొని.. అన్ని మతాలకు చెందిన ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీసీపీ వెల్లడించారు.

mvp colony saibaba temple robbery
డీసీపీ-1 ఐశ్వర్య రస్తోగి

By

Published : Sep 14, 2020, 10:34 PM IST

ఈ నెల 12న విశాఖ ఎంవీపీ కాలనీ సాయిబాబా ఆలయంలో చోరీకీ ప్రయత్నించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని విశాఖ శాంతిభద్రతల డీసీపీ-1 ఐశ్యర్య రస్తోగి వివరించారు. అర్ధరాత్రి సమయంలో ద్విచక్రవాహనంపై నిందితులు వచ్చినట్లు తెలిపారు. ఆలయం గోడ దూకి.. రాడ్డుతో హుండీ పగులగొడుతుండగా, అక్కడే ఉన్న వాచ్​మెన్ వారిని పట్టుకునే ప్రయత్నం చేసినట్లు వివరించారు. అక్కడ నుంచి తప్పించుకునే క్రమంలో నిందితులు ద్విచక్ర వాహనాన్ని వదిలి పారియారని తెలిపారు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరా, వాచ్​మెన్ చెప్పిన ఆధారాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

వాచ్​మెన్ అప్రమత్తత వలనే ఆలయంలో చోరీని నియంత్రించగలిగి.. నిందితులను అరెస్టు చేయగలిగామని డీసీపీ తెలిపారు. అంతర్వేది ఘటనను దృష్టిలో పెట్టుకొని, నగరంలో అన్ని ఆలయాలంపై దృష్టి పెట్టామనీ... దొంగలు ఆలయాల వద్ద చేసే చేష్టల వలన మత విద్వేషాలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ప్రజలంతా సమన్వయం, అప్రమత్తతతో ఉండాలని కోరారు. ప్రార్థనా మందిరాలు, ఆలయాలు, మసీదులు వద్ద సెక్యూరిటీతో పాటు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:కరోనా బారిన పడిన జర్నలిస్టులను ఆదుకోవాలని నిరసనలు

ABOUT THE AUTHOR

...view details