ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేటి నుంచి విశాఖలో ఎంపీ విజయసాయి ప్రచారం

By

Published : Feb 27, 2021, 7:39 AM IST

విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు.. వైకాపా తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో... మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం ఎంపీ విజయసాయిరెడ్డి.. నేటి నుంచి విశాఖలో పర్యటించనున్నారు. అన్ని వార్డుల్లో తిరుగుతూ.. ఓటర్లను కలవనున్నారు.

vijayasaireddy
ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో.. అధికార పార్టీ వైకాపా ప్రచార దూకుడు పెంచింది. నేటి నుంచి వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి.. వార్డుల వారీగా ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వైభవ వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి.. విశాఖ ఉత్తర నియోజకవర్గ వార్డుల్లో ప్రచారం మెుదలుపెట్టనున్నారని నేతలు తెలిపారు. విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో విజయసాయి ప్రచారం చేస్తారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details