ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంకెలపాలెం జంక్షన్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్​ జామ్​.. నిత్యం నరకమే - పరవాడ ఫార్మాసిటీ

Traffic Problems at Lankelapalem Junction : ఉమ్మడి విశాఖ జిల్లాలో లంకెలపాలెం కూడలి అత్యంత ప్రధానమైంది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పరిధిలోకి వచ్చే ఈ కూడలి జాతీయ రహదారి 16పై ఉంటుంది. వేల మందికి ఉపాధికి నెలవైన అచ్యుతాపురం సెజ్, పరవాడ ఫార్మాసిటీలకు వెళ్లే ముఖ్య కూడలి. ప్రతినిత్యం వేల సంఖ్యలోనే ఉద్యోగులను తీసుకువెళ్లే వాహనాలు ఈ కూడలి మీదుగానే వెళ్లాల్సి ఉన్నా ఇక్కడ ట్రాఫిక్​కి సరిపడా రహదారి తీరని కలగానే ఉంది. సరకు రవాణా చేసే అతి భారీ వాహనాలు కూడా ఇదే కూడలి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ పాదచారులు, వాహనదారుల అవస్ధలు వర్ణనాతీతంపై వంతెన నిర్మాణం ఎప్పటి నుంచో ప్రతిపాదనలకే పరిమితం అవుతోంది. వాహనాలు వదిలే కాలుష్యం అత్యంత గరిష్ట స్దాయిలో ఉంటుంది. ట్రాఫిక్​ సమస్యలపై ప్రత్యేకమైన కథనం.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 20, 2023, 3:25 PM IST

ఉమ్మడి విశాఖకు తప్పని ట్రాఫిక్ సమస్య

Traffic Problems at Lankelapalem Junction : రాష్ట్రంలోని ప్రధాన పరిశ్రమలు, ఓడరేవు, చూడచక్కని పర్యాటక ప్రదేశాలు భారతదేశానికి తూర్పు నౌకా దళం వంటి ఇన్ని ప్రత్యేకతలున్న ఉమ్మడి విశాఖ జిల్లాకు ఇంకా ట్రాఫిక్ సమస్యలు వీడటం లేదు. విశాఖలో అత్యంత ప్రధానమైన లంకెలపాలెం కూడలిలో జాతీయ రహదారి 16 పై ట్రాఫిక్‌ సమస్యలతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల మంది ఉపాధికి నెలవైన అచ్యుతాపురం సెజ్, పరవాడ ఫార్మసిటీలకు.. నిత్యం ఉద్యోగులను తీసుకువెళ్లే వాహనాలు ఈ కూడలి మీదుగానే వెళ్తున్నాయి. వీటికితోడు సరుకు రవాణా చేసే భారీ వాహనాలతో కూడలి మరింత రద్దీగా మారుతోంది.

విశాఖ నగరానికి రావాలంటే లంకెలపాలెం ఒక ముఖ ద్వారం. ఇక్కడ నుంచి రోజు వందల వాహనాలు, వేల సంఖ్యలో మనుషులు, పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వాహనాలు ఈ కూడలి ద్వారానే వెళతాయి. ఎందుకంటే ఇది ఎంత ప్రధానమైన కూడలంటే విశాఖ నగరానికి దాదాపు 35 కిలోమీటర్లు దూరం ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి అచ్యుతాపురం ఫార్మాసిటి వైపు భారీ వాహనాలు వెళ్తాయి. అంతే కాకుండా విజయ నగరం, సబ్బవరం, విశాఖ నగరానికి వెళ్లే వాహనాళ్లన్ని ఈ కూడలి ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఐతే ఇక్కడ ప్రధాన సమస్య ఈ జంక్షన్ అత్యంత ఇరుకైన జంక్షన్​లలో ఒకటి. ఇక్కడ ఫ్లైఓవర్​ కాని పెద్ద ఎత్తున వాహనాలు వెళ్లడానికి భద్రతా సౌకర్యాలు కాని.. ఏమి లేవు.

డ్యూటీ సమయంలో ఈ ట్రాఫిక్ వల్ల దాదాపు 2, 3 గంటలు ఆలస్యమవుతుంది. లారీలు తిరగడం వల్ల కాలుష్యం అధికమౌతుంది. దీనికి పరిష్కారంగా రహదారి విస్తరణ చేయాలి. -వాహనదారుడు

ఉదయం డ్యూటీకి వెళ్లేటప్పుడు 9 గంటలకు అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నాం. -వాహనదారుడు

ఫార్మాసిటి బస్సుల కారణంగా ఎక్కువ ట్రాఫిక్ ఏర్పడుతుంది. దీనికి మార్గంగా రింగ్ రోడ్డు వేస్తే సమస్య పరిష్కారమౌతుంది. అన్ని వాహనాలు సులువుగా వెళతాయి. -వాహనదారుడు

ఈ సమస్యను గట్టెక్కించాలంటే ఇక్కడ కచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించి రహదారుల భద్రతా చర్యలు.. అలాగే పై వంతెనలు నిర్మించాలని పాదచారులు, వాహనదారులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details