ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కంటైన్మెంట్ జోన్​లో ప్రజలను పట్టించుకోరా'? - containment zons news in vizag

విశాఖ జిల్లా గవరపాలెం ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించిన అధికారులు అక్కడి ప్రజల సమస్యలపై దృష్టిపెట్టటం లేదని ఎమ్మెల్సీ బుద్ధనాగ జగదీశ్వరరావు ఆరోపించారు. వార్డు వాలంటీర్లతో కంటైన్మెంట్ జోన్ పరిధిలోని ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

mlc buddha  naga jagadiswara rao demands provide grossaries to  redzone area people
mlc buddha naga jagadiswara rao demands provide grossaries to redzone area people

By

Published : Jun 12, 2020, 12:54 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు పెరగటంతో గవరపాలెం ప్రాంతాన్ని మొత్తం కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారని, ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యలను అధికారులు పట్టించుకోవటం లేదని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు పాస్​లు అందించాలని కోరారు. కరోనా సోకిన వారికి 10వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కంటైన్మెంట్ జోన్ పరిధిలోని ప్రజలకు వార్డు వాలంటీర్లతో నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details