విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రతిరోజూ వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. 10 రోజుల్లోపే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాలువల వ్యవస్థ మెరుగుపర్చేందుకు రూ. 30 కోట్లతో ప్రణాళికను రచించామన్నారు. పారిశుద్ధ్యం, తాగనీరు సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు.
10 రోజుల్లోపే సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే కరణం - వార్డుల్లో పర్యటిస్తున్న చోడవరం ఎమ్మెల్యే
చోడవరంలోని సమస్యలపై ప్రతి రోజు ఆరా తీసి పరిష్కరిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు.
![10 రోజుల్లోపే సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే కరణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5103452-404-5103452-1574079470628.jpg)
'స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు'
'స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు'