ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: ఎమ్మెల్యే ధర్మశ్రీ - విశాఖ జిల్లా చోడవరంలో రచ్చబండ కార్యక్రమం తాజా వార్తలు

గత ప్రభుత్వాల కంటే భిన్నంగా పేదలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహించారు.

పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: ఎమ్మెల్యే ధర్మ శ్రీ
పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: ఎమ్మెల్యే ధర్మ శ్రీ

By

Published : Nov 23, 2020, 7:47 AM IST

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా రోలుగుంట మండలం ముఖాసా కొత్తపట్నం, బిబిపట్నం, రత్నం పేట తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. ఆయా ప్రాంతాల స్థానికులను కలుసుకున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే అనేక ఫలాలను పేదలకు అందించామని చెప్పారు.

రైతు భరోసా, అమ్మఒడి, విద్యా కానుక తదితర కార్యక్రమాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని పేర్కొన్నారు. అనంతరం రత్నంపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నేతలు అప్పలనాయుడు, భాస్కరరావు, సత్యంనాయుడు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details