ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాడికి గురైన తెదేపా అభ్యర్థిని పరామర్శించిన ఎమ్మెల్యే గణబాబు

దాడికి గురైన తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి శరగడం రాజశేఖర్​ను ఎమ్మెల్యే గణబాబు పరామర్శించారు. ఓటమి భయంతో ప్రత్యర్థి వర్గం బెదిరింపులు, దాడులకు పాల్పడుతోందని ఆయన అన్నారు.

By

Published : Mar 8, 2021, 1:12 PM IST

MLA Ganababu
దాడికి గురైన తెదేపా అభ్యర్థికి ఎమ్మెల్యే గణబాబు పరామర్శ

విశాఖ జిల్లా గవర కంచరపాలెంలో దాడికి గురైన తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి శరగడం రాజశేఖర్​ను ఎమ్మెల్యే గణబాబు పరామర్శించారు. రాజశేఖర్​పై దుండగులు రాళ్లతో దాడి చేయటం అన్యాయమన్నారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఓటు వేయకుంటే అభివృద్ధి పనులు చేయమని చెప్పటం, సంక్షేమ పథకాలు ఇవ్వకపోవటం ఎప్పుడూ చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details