ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హైపవర్ కమిటీ నివేదికలోని అంశాలను అమలు చేయండి'

విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనపై.. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక.. ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల అభిప్రాయాలను ప్రతిబింబించేలా ఉందని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. అందులోని అంశాలను పక్కాగా అమలు చేయాలని కోరుతూ సీఎం జగన్​కు లేఖ రాశారు.

By

Published : Jul 11, 2020, 2:37 PM IST

mla-ganababu-letter-to-cm-jagan-on-vizag-lg-gas-leakage-incident
గణబాబు, ఎమ్మెల్యే

విశాఖ ఎల్జీ గ్యాస్ లీకేజీ ఘటనపై హైపవర్ కమిటీ నివేదికలోని అంశాలను పక్కాగా అమలు చేయాలని కోరుతూ.. ఎమ్మెల్యే గణబాబు ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. నీరబ్ కుమార్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ నివేదిక.. ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల అభిప్రాయాలను ప్రతిబింబించేలా ఉందన్నారు. వాటిని అమలుచేసి బాధితులకు న్యాయం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

పరిశ్రమను జనావాసాల నుంచి తరలించాలని ఎమ్మెల్యే కోరారు. బాధిత ప్రాంతాల్లో ఇంకా చాలామందికి పరిహారం అందాల్సి ఉందని.. బాధితులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించాలని కోరారు. ఘటన తర్వాత చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారని.. వారికి పరిహారం అందేలా సీఎం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details