ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగనన్న పచ్చతోరణంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

విశాఖ జిల్లా పాడేరు మండలంలో 71వ వన మహోత్సవంలో భాగంగా జగనన్న పచ్చతోరణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని మొక్కలు నాటారు.

By

Published : Jul 22, 2020, 4:07 PM IST

MLA planting plants in Jagannath pacchatoranam
జగనన్న పచ్చతోరణంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

విశాఖ మన్యంలో జగన్ అన్న పచ్చతోరణం వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 71 వన మహోత్సవంలో భాగంగా పాడేరు మండలం చింతలవీధి పంచాయతీ నడింవీధి హౌసింగ్ లేవుట్ వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో డాక్టర్ వెంకటేశ్వర్లు, డిఎఫ్​ఓ వినోద్ కుమార్ మొక్కలు నాటారు. విశాఖ ఏజెన్సీ అటవీ ప్రాంతంలో 11 మండలాల్లో 16.5 లక్షలు మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. త్వరలోనే ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో ప్రారంభమవుతుందని వినోద్ కుమార్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details