ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హెచ్​పీసీఎల్ ఘటనపై మంత్రులు ఆరా... సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం

విశాఖ జిల్లా హెచ్​పీసీఎల్ ఘటనపై మంత్రులు సుచరిత, కన్నబాబు ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సెన్సార్లు బాగా పని చేయడం వల్లే సిబ్బందికి ప్రాణాపాయం తప్పిందని మంత్రులు తెలిపారు.

By

Published : May 25, 2021, 7:41 PM IST

Ministers sucharitha, kannababu
మంత్రులు సుచరిత , కన్నబాబు

విశాఖ జిల్లా హెచ్‌పీసీఎల్ ఘటనపై మంత్రులు సుచరిత, కన్నబాబు ఆరా తీశారు. కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు భయాందోళనకు గురి కావల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హెచ్‌పీసీఎల్‌లో అత్యాధునిక అగ్నిమాపక హెచ్చరిక వ్యవస్థ ఉందన్న కన్నబాబు... సెన్సార్లు బాగా పని చేయడం వల్లే సిబ్బందికి ప్రాణాపాయం తప్పిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details