ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 28, 2020, 3:02 PM IST

ETV Bharat / state

రైతులకు దన్నుగా నిలిచే ప్రభుత్వం వైకాపా: ముత్తంశెట్టి

విశాఖలో వైఎస్​ఆర్ జలకళ పథకాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఉచితంగా బోర్లు వేయడానికి భీమిలి, మాడుగుల, చోడవరం నియోజక వర్గాలకు నిర్దేశించిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

minister muttamshetti srinivas started ysr jalakala at vishaka
minister muttamshetti srinivas started ysr jalakala at vishaka

రైతులకు దన్నుగా నిలిచేది వైకాపా ప్రభుత్వమని, అందుకే పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకునే రీతిలో జలకళ పథకం ప్రారంభించారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు.

ఒక బోర్ విఫలమైనా... మరో బోర్ వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. పూర్తిగా ఆన్​లైన్​లో ఈ పథకానికి లబ్ధి దారులను నమోదు చేసుకుని, వారికి సౌకర్యం కలిగిస్తునట్టు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details