ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాకు సాక్షి మాత్రమే ఉంది.. ప్రతిపక్షానికి ఎన్ని ఉన్నాయో' - విశాఖ జిల్లాలో విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి ముత్తంశెట్టి

తమ ప్రభుత్వానికి సాక్షి పేపర్, న్యూస్ ఛానల్ మద్దతు మాత్రమే ఉందని.. ప్రతిపక్షానికి ఎన్నో ఛానళ్లు ఉన్నాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం.. సాక్షి మీడియా ద్వారా గొప్పలు చెప్పుకొంటోందన్న ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

minister muttamsetti srinivasarao fires on tdp
రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

By

Published : May 18, 2020, 6:35 PM IST

Updated : May 18, 2020, 6:47 PM IST

రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత మీడియా ద్వారా గొప్పలు చెప్పుకొంటోందన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఘూటుగా స్పందించారు. తమకు సాక్షి మద్దతు మాత్రమే ఉందన్నారు. మిగతా పార్టీలకు ఎన్నో పేపర్లు, ఛానల్స్ ఉన్నట్టు చెప్పారు.

విశాఖ జిల్లా ఆనందపురం మండలం బోని గ్రామంలో రైతులకు ఖరీఫ్​ సీజన్​ కోసం రాయితీ విత్తనాలు అందజేశారు. భీమునిపట్నం నియోజకవర్గ పరిధిలో ఆనందపురం, పద్మనాభం మండలాల్లో సచివాలయాల ద్వారా విత్తన పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

Last Updated : May 18, 2020, 6:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details