ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tourism: వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం: మంత్రి అవంతి శ్రీనివాస్​ - minister avanthi on tourisum department in ap

పర్యటక, క్రీడల శాఖలో కొవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు నిధులతో పర్యాటక రంగంలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.

minister avanthi  srinivas
minister avanthi srinivas

By

Published : Sep 8, 2021, 3:06 PM IST

పర్యటక, క్రీడల శాఖకు సంబంధించి కొవిడ్‌తో 8 మంది మృతి చెందారని మంత్రి అవంతి శ్రీనివాస్​ అన్నారు. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లు దాటిన ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల బదిలీకి ఆదేశాలిచ్చినట్లు మంత్రి తెలిపారు. పర్యాటక శాఖ ఉద్యోగులకు.. కలెక్టర్లు ఇతర బాధ్యతలు అప్పగిస్తున్నారని.. పర్యాటక ప్రోత్సాహక విధుల కోసమే వారిని వినియోగించాలని ఆదేశించారు.

కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు నిధులతో పర్యాటక రంగంలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్​ అన్నారు. సీ ప్లేన్‌లను ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోందన్నారు. కరోనా నిబంధనలతో ఈనెల 27న పర్యాటక దినోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సీఎం కప్ పేరిట 13 జిల్లాల్లో క్రీడల ప్రోత్సాహానికి మళ్లీ పోటీలు నిర్వహిస్తామని మంత్రి అవంతి అన్నారు. క్రీడలను ప్రోత్సహించే పాఠశాలలకు అవార్డులు ఇస్తామన్నారు. ఖేలో ఇండియా ద్వారా కేంద్ర నిధులకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. దసరా నాటికి కొత్త క్రీడా విధానం తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Results: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details