ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. కొన్నాళ్లకు తల్లీ అనారోగ్యంతో మంచం పట్టింది. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నాడు. నెల క్రితం తండ్రయ్యాడు. ఏమైందో తెలియదు.. బాబు జన్మించిన తరువాత పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

By

Published : Jan 28, 2021, 6:18 PM IST

Updated : Jan 29, 2021, 10:39 AM IST

died
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో జరిగింది. గడుగుపల్లికి చెందిన తామర్ల త్రినాథ్​కు ఏడాది కిందట వివాహం జరిగింది. నెలరోజుల కిందట అతని భార్య బాబుకు జన్మనిచ్చింది. అనంతరం పుట్టింటికి వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. అత్తగారింటికి వెళ్లిన త్రినాథ్​ భార్యను ఇంటికి తీసుకెళ్తాననగా.. అందుకు వారు ఒప్పుకోలేదు. మనస్తాపం చెందిన త్రినాథ్ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతణ్ని స్థానికులు పాడేరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. తోడుగా ఎవరూ లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Last Updated : Jan 29, 2021, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details