ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిస్సహాయ స్థితిలో నిండు చూలాలు.. - విమ్స్ ఆసుపత్రిలో నిండుగర్భిణి కి వైద్యం

విశాఖ జిల్లా విమ్స్ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన నిండుగర్భిణిని ఎవరూ పట్టించుకోలేదు. పడకలు లేవని చెప్పడంతో..వైద్యం లేకుండానే ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయింది.

Medical help is not available to pregnent lady at visakha district
కరోనా పాజిటివ్ వచ్చిన నిండుగర్భిణి

By

Published : Aug 13, 2020, 8:28 AM IST

Updated : Aug 13, 2020, 9:18 AM IST

నిండుగర్భిణి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా వైద్యసహాయం లభించక తిరిగి ఇంటికి చేరుకుంది. విశాఖపట్నం జిల్లా మునగపాకకు చెందిన నిండు గర్భిణికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైద్యాధికారి ఈ నెల 10న ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి 108లో తరలించారు. అక్కడ కరోనా సోకిన గర్భిణులకు వైద్యసేవలు అందించే అవకాశం లేకపోవడంతో విమ్స్​కు పంపారు. 108 సిబ్బంది అక్కడ వారిని దింపేసి వెళ్లిపోయారు. కానీ, విమ్స్​లో వాళ్లనూ ఎవరూ పట్టించుకోలేదు. పడకలు అందుబాటులో లేవని చెప్పారు. తప్పనిసరై ఆమె ఆటోలో ఇంటికి వచ్చేశారు. దీనిపై మునగపాక పీహెచ్​సీ వైద్యాధికారి అనిల్​కుమార్​ను వివరణ కోరగా..విమ్స్​లో మంచాలు లేవంటూ గర్భిణీని తిప్పిపంపేసినట్లు తెలిసిందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Last Updated : Aug 13, 2020, 9:18 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details