ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదివారం రోజు మాంసం విక్రయాలకు అనుమతివ్వండి - విశాఖలో మాంసం దుకాణాలు

చేపలు , మాంసం విక్రయదారులు విశాఖ మేయర్​. డిప్యూటీ మేయర్​లను కలిశారు. ఆదివారం రోజులు మాంసం విక్రయాలు నిలిపివేయాలని కమిషనర్ ఇచ్చిన ఆదేశాల గురించి ఓసారి ఆలోచించాలని వారు కోరారు. ఆదివారం రోజు మాత్రమే తమకు అధికంగా విక్రయాలు జరుగుతాయని వారు తెలిపారు.

visakha
మేయర్​ను కలిసిన మాంసం వ్యాపారులు

By

Published : May 27, 2021, 9:46 PM IST

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో గల మాంసం, చేపలు విక్రయదారులు మేయర్, డిప్యూటీ మేయర్​లను ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం రోజు మాంసం, చేపలు విక్రయించే దుకాణాలు మూసివేయాల్సిందిగా జీవీఏంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై.. పునరాలోచించాలని వారు కోరారు. లాక్​డౌన్ కారణంగా ఇప్పటికే అనేక ఇబ్బందులుకు గురి అవుతున్నామని... ఆ రోజు జరిగే వ్యాపారం వల్ల కాస్తో కూస్తో తమకు ఆదాయం చేకూరుతుందని అన్నారు. ఆదివారం నాడు దుకాణాలు మూసివేయలనే ఆదేశాలు వెనక్కి తీసుకుని తమ వ్యాపారానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని వారిని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details