విశాఖ జిల్లా కొయ్యూరు ఎదురుకాల్పుల్లో మృతి చెందినన మావోయిస్టుల మృతదేహాలకు విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రమే మృతదేహాలను ఆస్పత్రికి తీసుకురాగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలోకి మీడియాను అనుమతించలేదు. కోర్టు మార్గదర్శకాల దృష్ట్యా మృతదేహాలకు కరోనాతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు.
మావోయిస్టుల మృతదేహాలకు కొనసాగుతున్న పోస్టుమార్టం ప్రక్రియ - విశాఖ మావోయిస్టుల ఎన్ కౌంటర్ వార్తలు
కొయ్యూరు ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం కొనసాగుతోంది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత నడుమ పోస్టుమార్టం ప్రక్రియ జరుగుతోంది. మీడియాను ఆస్పత్రి ప్రాంగణంలోకి అనుమతించకుండా ఆంక్షలు విధించారు.
mavos bodies postmortem in vishakha