ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో భారీ ఎత్తున బెల్లం ఊట ధ్వంసం - ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో నాటుసారా తయారీ కేంద్రాలు తాజా వార్తలు

విశాఖ మన్యం ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మారుమూల కొండ ప్రాంతాల్లో నాటుసారా కేంద్రాలపై ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.

borders of Andhra Pradesh and Orissa
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో భారీ ఎత్తున బెల్లం ఊట ధ్వంసం

By

Published : Jul 21, 2020, 11:37 PM IST

హుకుంపేట మండలం శివారు గరుడపల్లి ఒడిశా రాష్ట్రం సరిహద్దులో నిత్యం నాటుసారా రవాణా అవుతోంది. దీనిని గుర్తించిన ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు ఆ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి నిల్వ ఉంచిన 5400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఒడిశా ప్రాంతం నుంచి మన్యం ముంచంగిపుట్టు మండలం పెదబయలు, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాలకు అధిక మొత్తంలో నాటుసారా అమ్మకాలు జరుగుతున్నాయి. నాటుసారా అక్రమ తయారీ కట్టడి చర్యల్లో భాగంగా ఈ దాడులు చేసి నాటుసారా కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details