కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని విశాఖ జిల్లా అనకాపల్లి ట్రాఫిక్ సీఐ బాబూజీ సూచించారు. మాస్కులు లేకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
'మాస్కు లేకుండా బయటికొస్తే కఠిన చర్యలు తప్పవు'
మాస్కులు లేకుండా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని అనకాపల్లి ట్రాఫిక్ సీఐ బాబూజీ హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు మాస్కులతో పాటుగా హెల్మెట్ను కచ్చితంగా ధరించాలన్నారు.
మాస్కులు తప్పనిసరి