ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహిత అనుమానాస్పద మృతి.. పోలీసుల ఆరా

వివాహిత తన ఇంట్లో అచేతనంగా పడి మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలోని రెల్లివీధిలో చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా భర్తే ఆమెపై దాడి చేసి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Jul 20, 2020, 5:43 PM IST

married woman suspected death
వివాహిత అనుమాస్పద మృతి

విశాఖలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి రెల్లివీధిలో చోటు చేసుకుంది. లక్ష్మీ అనే 21 ఏళ్ల వివాహిత మృతి చెందగా.. ఆమె మృతదేహం ఇంట్లో అచేతనంగా పడి ఉంది. అయితే భర్త దాడి చేయడం వల్లే భార్య మృతి చెందిందని స్థానికులు చెబుతున్నారు. భార్యను చున్నీతో ఊరి వేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలే హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి...

కరోనా మృతదేహానికి అంతిమ సంస్కారం.. గిరిజన యువత ఆదర్శం

ABOUT THE AUTHOR

...view details