ఇదీ చదవండి:
మావోయిస్టులపై గ్రామస్థులు దాడి.. ఒకరి మృతి - maoists are attacked by villagers andhra odisha border
ఆంద్రా - ఒడిశా సరిహద్దుల్లోని చిత్రకొండ బ్లాక్ పరిధిలో మావోయిస్టులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. జొడొంబో పంచాయతీ జంతురాయ్ గ్రామానికి... శనివారం రాత్రి ముగ్గురు సాయుధ మావోయిస్టులు వచ్చారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని తమతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులకు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ జరిగింది. మావోయిస్టులపై గ్రామస్థులు రాళ్లు రువ్వగా... ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన మావోయిస్టును మల్కన్గిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

మావోయిస్టులపై దాడి చేసిన గ్రామస్థులు