ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోయిస్టులపై గ్రామస్థులు దాడి.. ఒకరి మృతి - maoists are attacked by villagers andhra odisha border

ఆంద్రా - ఒడిశా స‌రిహ‌ద్దుల్లోని చిత్ర‌కొండ బ్లాక్ ప‌రిధిలో మావోయిస్టులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. జొడొంబో పంచాయ‌తీ జంతురాయ్ గ్రామానికి... శ‌నివారం రాత్రి ముగ్గురు సాయుధ మావోయిస్టులు వ‌చ్చారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని త‌మ‌తో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామ‌స్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల‌కు, గ్రామ‌స్థుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. మావోయిస్టుల‌పై గ్రామ‌స్థులు రాళ్లు రువ్వగా... ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయ‌ప‌డిన మావోయిస్టును మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

maoists are attacked by villagers at andhra odisha border
మావోయిస్టులపై దాడి చేసిన గ్రామస్థులు

By

Published : Jan 26, 2020, 2:13 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details