ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 29, 2020, 4:30 PM IST

Updated : Nov 29, 2020, 7:19 PM IST

ETV Bharat / state

విశాఖ మన్యంలో మావోయిస్టుల పోస్టర్లు

విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం పరిధిలోని పలు గ్రామాల్లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. పీఎల్జీఏ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

maoist posters
maoist posters

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. పీఎల్జీఏ 20వ వార్షికోత్సవావలను ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజ్ పేరిట పిలుపునిచ్చారు. జి.మాడుగుల మండలం మద్ది గరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి.

మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రాలు

పేర్కొన్న అంశాలు:

  • డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరిగే మావోయిస్టుల వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకోవాలి.
  • శత్రువు ముందు లొంగుబాటు బానిసత్వంతో సమానం.
  • రకరకాల ఆశలు చూపించి లొంగదీసుకునే శత్రువు కుట్రలను తిప్పి కొట్టండి.
  • యువతీ యువకులు వేలాదిగా పీఎల్జీఏలో చేరండి. భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయండి. అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.
Last Updated : Nov 29, 2020, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details