ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ కొవిడ్ వార్డులో ఆభరణాలు మాయం.. పోలీసులతో బాధితుల వాగ్వివాదం

By

Published : May 14, 2021, 7:33 AM IST

Updated : May 14, 2021, 8:11 AM IST

కొవిడ్ వార్డులో ఆభరణాలు మాయమైన ఘటన విశాఖ నగర పరిధిలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. స్థానిక సీఎస్​ఆర్​ బ్లాకులోని కరోనా చికిత్స గదిలో ఈ కలకలం జరిగింది. ఈ మేరకు మృతదేహాల నుంచి బంగారు ఆభరణాలు అదృశ్యమవుతున్నాయని సంబంధిత కుటుంబీకులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ కొవిడ్ వార్డులో ఆభరణాలు అదృశ్యం.. పోలీసులతో వాగ్వివాదం
ఆ కొవిడ్ వార్డులో ఆభరణాలు అదృశ్యం.. పోలీసులతో వాగ్వివాదం

విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలోని సీఎస్​ఆర్ బ్లాక్​లోని కొవిడ్ వార్డులో చోరీ చోటు చేసుకుంది. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి నుంచి బంగారు ఆభరణాలు అదృశ్యమవుతున్నాయని మృతుల కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం చేయండి..

ఈ విషయమై సిబ్బందిని బాధితల బంధువులు నిలదీశారు. విధుల్లో ఉన్న పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలకు సంబంధించి చేతి వాటం ప్రదర్శిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టు బట్టారు.

ఆ కొవిడ్ వార్డులో ఆభరణాలు మాయం.. పోలీసులతో బాధితుల వాగ్వివాదం

ఇవీ చూడండి :

ఆస్పత్రుల్లో పడకల మేరకు ఆక్సిజన్‌ సరఫరా ఉండాల్సిందే: సీఎం

Last Updated : May 14, 2021, 8:11 AM IST

ABOUT THE AUTHOR

...view details