విశాఖలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సుప్రసిద్ధ సంగీత ప్రముఖులు, దివంగత మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తెలుగు భాషా సంఘ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్లు పాల్గొన్నారు. బాలమురళీకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం బాలమురళీకృష్ణ కృతులను విన్నారు.
విశాఖలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90వ జయంతి - రాష్ట్ర భాష సాంస్కృతిక అకాడమీ చైర్ పర్సన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ .
విశాఖలో సుప్రసిద్ధ సంగీత ప్రముఖుడు, దివంగత మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90వ జయంతి ఘనంగా జరిగింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు.
విశాఖలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90వ జయంతోత్సవం
తెలుగు వారి సంగీత సామర్ధ్యాన్ని దశ దిశలా వ్యాపింప చేసిన బాలమురళి కృష్ణను మననం చేసుకోవటం జాతికి గర్వకారణం అని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్టాలలో ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని అన్నారు.